జాండ్రపేట గ్రామప్రజలకు శుభవార్త..!

JYOTHI SAMBARAM IMAGES


సృష్టి కారకుడైన బ్రహ్మ విశ్వ సృష్టికి ఉపక్రమించి పంచ భూతములను తద్వారా దేవ, దానవ, మానవ, పశు పక్ష్యాది జీవ రాశులను సృజించెను.ఆ జీవరాసులలో పశు పక్ష్యాదులు ఎదుగుతూ దేహాభిమానము లేక సిగ్గు తెలియక నగ్నముగా సంచరించు చున్నవి. కాని బుద్ధి జీవులైన దేవ, దానవ, మానవ జాతులు దిగంబర సంచారము చూసి బ్రహ్మ కడుపు జుగుప్స పొంది మిక్కిలి భాదతో దేహ ఆచ్చాదనకు అవసరమైన వస్త్రమును తయారుచేయుటకు సిద్దపడెను. అయితే ఎంత ప్రయత్నించినా బ్రహ్మకు వస్త్రోత్పత్తి సాద్యము కాలేదు. దీనితో బ్రహ్మ కైలాసమునకేగి సృష్టి లోపమును నివేదించగా ఆ పరమేశ్వరుడు తరునోపాయముగా "దేవల మహర్షి" అనే దివ్య పురుషుని సృష్టించి ఆ మహాత్ కార్యమును ఆప్పగించెను. అంతట ఆ దేవల మహర్షి వస్త్రమును సృష్టించి, లోకమునకు అందించి సర్వ లోకాలకు నాగరికత నేర్పించెను. ఆ విధముగా మానరక్షణకు వస్త్ర సూత్ర సృష్టి చేయుట చేత "దేవలమను బ్రహ్మ " గా కీర్తింపబడెను. ఆ దివ్య పురుషుని వంశ శంభుతలే మన దేవాంగులు. మన దేవాంగులను పూర్వము "దేవ బ్రాహ్మణులూ" అని కూడా పిలిచేవారు

Friday, December 30, 2011

బంగారుపళ్లెం - Bangaru Pallem


అనగనగా ఒక ఊరిలో సోము అనే అబ్బాయి ఉండేవాడు. ఒకరోజు సోము తండ్రి పాతకాలం నాటి ఇనుపపెట్టెను శుభ్రం చేస్తూ ఉంటే, సోము దానిలో ఉండే బంగారు పళ్లాన్ని బయటికి తీసి, దానితో ఆడుకోసాగాడు. అది చూసిన తండ్రి సోము వీపు మీద రెండు దెబ్బలు వేసి దాన్ని లాక్కుని, ‘‘ఇది ఆడుకునే వస్తువు కాదు. దీన్ని మన వంశప్రతిష్ఠకి గుర్తుగా తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్నాం.

ఇంకెప్పుడూ దీనితో ఆడకు’’ అని కోప్పడ్డాడు. బంగారు పళ్లాన్ని భద్రంగా పెట్టెలో పెట్టి తాళం వేశాడు. తండ్రి కొట్టిన దెబ్బలకు, తిట్టిన తిట్లకు సోము చాలా బాధ పడ్డాడు. ఏడుస్తూ ఇంట్లోంచి బయటకు నడిచాడు.

ఊరి చివర తోటలోకి వెళ్లి ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని బాధపడసాగాడు. అంతలో ఇద్దరు దొంగలు అక్కడికి వచ్చి, ఆ చెట్టుకి మరో వైపున కూర్చున్నారు. వాళ్లు దొంగిలించిన నగల్ని పంచుకోవడానికి గొడవ పడసాగారు. వాళ్ల మాటల్ని జాగ్రత్తగా వింటున్న సోముకి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే లేచి చప్పుడు కాకుండా నడుస్తూ అక్కడికి దగ్గర్లో ఉన్న బావి దగ్గరికి వెళ్లి, బావిలోకి చూస్తూ , ‘బంగారు పళ్లెం’, ‘బంగారు పళ్లెం’ అని గట్టిగా ఏడ్వసాగాడు. అది విన్న దొంగలు ఆ బావి దగ్గరికి వెళ్లారు.

సంగతేంటని అడిగారు. ‘‘మా ముత్తాత గొప్ప పండితుడు. అప్పట్లో ఆయనకి రాజుగారు పే...ద్ద బంగారు పళ్లెం బహుమతిగా ఇచ్చారు. మా ఇంట్లో పెట్టెలో ఉన్న ఆ పళ్లాన్ని తీసి, ఇక్కడికి వచ్చి ఆడుకుంటుంటే అది బావిలో పడిపోయింది. దాన్ని ముట్టుకున్నానని తెలిస్తేనే మా నాన్న కొడతాడు. ఇక అది పోయిందని తెలిస్తే చంపేస్తారు’’ అని సోము పెద్దగా ఏడవసాగాడు. దొంగలకి దాన్ని తీసుకోవాలనే ఆశ పుట్టింది. ‘‘నేను తీసిస్తానంటే నేను తీసిస్తాను’ అంటూ పోటీ పడ్డారు. వాళ్ల చేతుల్లో ఉన్న నగలమూటని కింద పెట్టి ఇద్దరూ బావిలో దూకారు.

సోము వెంటనే ఆ నగల మూటని తీసుకొని ఊరిలోకి పరుగెత్తాడు. ఊర్లో పెద్దలకి దొంగల సంగతి చెప్పి వారిని బావి దగ్గరికి తీసుకుని వచ్చాడు. అందరూ కలిసి దొంగల్ని పట్టుకొని రాజభటులకి అప్పగించారు. ఆ నగలు ఎవరివో కనుక్కొని వారికి అందచేశారు. సోము తెలివిని, సమయస్ఫూర్తిని ఊరివారంతా మెచ్చుకున్నారు. సోము తల్లిదండ్రులు ఎంతో ఆనందించారు.

No comments:

Post a Comment